ఉప్పల్ జోన్ బృందం, జనవరి 2 : వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి సందర్భంగా సోమవారం ఉప్పల్ నియోజకవర్గంలోని వేంకటేశ్వరస్వామి ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. వేకువ జామునే సమీపంలోని ఆలయాలకు తరలివెళ్లిన భక్తులు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్నారు. ఉత్తరద్వార దర్శనం కోసం బారులు తీరారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నాచారంలోని హెచ్ఎంటీనగర్ వేంకటేశ్వరస్వామి ఆలయంలో కార్పొరేటర్ శాంతిసాయిజెన్ శేఖర్, భక్తులు పూజలు చేశారు. అదేవిధంగా ఉప్పల్ స్వరూప్నగర్లోని కరిగిరి వేంకటేశ్వర ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు.
సత్యనారాయణ స్వామి దేవాలయం, కోదండరామాలయం, కల్యాణ వేంకటేశ్వరస్వామి దేవాలయాల్లో ఉదయం నుంచే భక్తుల తాకిడి పెరిగింది. వేలాది మంది ఉత్తరద్వార దర్శనం చేసుకున్నారు. కోదండ రామాలయం చైర్మన్ కంది ఆగిరెడ్డి, సత్యనారాయణ స్వామి దేవాలయం చైర్మన్ కోట్ల నర్సింహారెడ్డి, ఆలయ ఈఓలు భక్తులకు ఏర్పాట్లు చేశారు.
శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకునేందుకు ఓల్డ్కాప్రా, సాయినగర్, యాదవబస్తీ, శ్రీరాం ఎన్క్లేవ్, గాంధీనగర్, ఏఎస్రావునగర్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చా రు. వేకువ జామున స్వామివారి పల్లకిసేవ నిర్వహించారు. పూజల్లో ఆలయం ఈఓ కృష్ణమాచారి, కమిటీ ప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు. అలాగే.. కాప్రా చెరువు సమీపంలోని రామాలయం, ఎల్లారెడ్డిగూడ ఆంజనేయస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా సందడి నెలకొంది.
కుషాయిగూడ శ్రీ పద్మావతి వేంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్ బొంతు శ్రీదేవిలు స్వామివారికి పట్టు వస్ర్తాలను సమర్పించారు. అదేవిధంగా ఏఎస్రావునగర్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీషాసోమశేఖర్రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. దర్శించుకున్నవారిలో మాజీ కార్పొరేటర్లు పజ్జూరి పావనీమణిపాల్రెడ్డి, కొత్త రామారావు, సింగిరెడ్డి ధన్పాల్రెడ్డి, ఆలయ కార్యనిర్వహక అధికారి కృష్ణమూర్తితో పాటు ఆలయ అర్చకులు, భక్తులు ఉన్నారు.
డివిజన్లోని తేనె లక్ష్మీనరసింహస్వామి ఆలయం, స్వరూప్నగర్లోని వేంకటేశ్వర స్వామివారిని కార్పొరేటర్ బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్, ఉప్పల్ తాసీల్దార్ గౌతమ్కుమార్ దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాసచారి, నేతలు కొండల్రెడ్డి, జగన్, శ్రీనివాస్యాదవ్, బాలు, రామానుజం, శ్యామ్, బాలు పాల్గొన్నారు.
హెచ్బీకాలనీ డివిజన్, మంగపురంలోని శ్రీవెంకటేశ్వర స్వామిని కార్పొరేటర్ జెర్రి పోతుల ప్రభుదాస్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కుషాయిగూడ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్ఐలు, మాజీ కార్పొరేటర్లు శ్రీనివాస్రెడ్డి, గొల్లూరి అంజయ్య, ఆలయ ఈఓ వెంకన్న, సముద్రాల కృష్ణమూర్తి, బ్రహ్మచారి, నాయకులు, వంజరి ప్రవీణ్, కురుణాకర్ దర్శించుకున్నారు.
డివిజన్ సూర్యనగర్కాలనీలోని శ్రీ లక్ష్మీగణపతి ఆలయంలో శ్రీ వేంకటేశ్వర స్వామిని కార్పొరేటర్ పన్నాల దేవేందర్రెడ్డి దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గౌరీశంకర్, పద్మారెడ్డి, అంజయ్య, నర్సింహరెడ్డి, ప్రభాకర్రెడ్డి, పవన్ పాల్గొన్నారు.