సిటీబ్యూరో, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): రాచకొండ పోలీస్ కమిషనర్గా దేవేంద్ర సింగ్ చౌహాన్(డీఎస్ చౌహాన్)ను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాచకొండ కమిషనరేట్ ఏర్పాటు నుంచి సుదీర్ఘకాలం కమిషనర్గా కొనసాగిన మహేశ్ భగవత్ సీఐడీ అదనపు డీజీగా బదిలీ అయ్యారు. రాచకొండకు రెండో కమిషనర్గా డీఎస్ చౌహాన్ ఒకటి రెండు రోజుల్లోనే బాధ్యతలు తీసుకోనున్నారు.
1997వ బ్యాచ్కు చెందిన చౌహాన్ గతంలో ఎక్సైజ్, కేంద్ర సంస్థలతో పాటు పలు జిల్లాల్లో పనిచేశారు. హైదరాబాద్ అదనపు కమిషనర్గా ఉన్నారు. తాజాగా రాచకొండ సీపీగా నియమితులయ్యారు. అదనపు కమిషనర్గా హైదరాబాద్లో పని చేసిన అనుభవంతో రాచకొండ కమిషనరేట్లో మరిన్ని టెక్నాలజీపరమైన సంస్కరణలతో ప్రజలకు వేగంగా, పారదర్శకమైన సేవలందిస్తానని ఈ సందర్భంగా చౌహాన్ ‘నమస్తే’కు తెలిపారు.