సిటీబ్యూరో, మార్చి 02 (నమస్తే తెలంగాణ ) : నాలా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి అధికారులను ఆదేశించారు. బుధవారం రూ. 12.86 కోట్ల వ్యయంతో ఏజీ కాలనీ నుంచి లక్ష్మీ కాంప్లెక్స్ వరకు చేపడుతున్న సనత్ నగర్ నాలా పనులను ఎర్రగడ్డ వద్ద మేయర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
వరద వలన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఆదేశాలతో డైనమిక్ మంత్రి కేటీఆర్ సారథ్యంలో నాలా అభివృద్ధి పనుల ప్రతిష్టాత్మకంగా చేపట్టి వచ్చే వర్షాకాలం వరకు పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. మొదటి దశలో రూ. 858 కోట్ల అంచనా వ్యయంతో 60 పనులను చేపట్టనున్నట్లు అట్టి ప్రతిపాదిత పనులను యుద్ధ ప్రాతిపదికన ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
అందులో 37 పనులు జీహెచ్ఎంసి పరిధిలో కాగా చుట్టూ ప్రకల మున్సిపాలిటీలలో 23 పనులు చేపట్టినట్లు మేయర్ అన్నారు. నాలా అభివృద్ధి జరుగుతున్న పనులలో ప్రతి రోజు ప్రగతిని సమాచారం అందజేయాలని అధికారులను ఆదేశించారు. మేయర్ వెంట జోనల్ కమిషనర్ రవి కిరణ్, ఎస్ భాసర్ రెడ్డి, ఈఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.