వెంగళరావునగర్ :టీఆర్ఎస్ పార్టీ పాలనలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. బుధవారం సోమాజిగూడ డివిజన్ పరిధిలోని సాయిసారధీ నగర్లో రూ.5 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపని చేశారు.
ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ. ప్రజా సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్విరామంగా కృషి చేస్తున్నదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అలుపెరుగని శ్రమజీవి అని పార్టీలోని ఇతర ప్రజాప్రతినిధులు, నేతలు ఆయనను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలన్నారు.
నియోజకవర్గంలో ఎక్కడ ఏ సమస్య ఉన్న నేరుగా తన దృష్టికి తెస్తే సమస్య పరిష్కారాని కట్టుబడి ఉంటానని తెలిపారు. కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు అప్పుఖాన్, తన్ను ఖాన్, మధు యాదవ్, శరత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.