బాలానగర్, ఫిబ్రవరి 6 : ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సోమవారం బాలానగర్ డివిజన్ పరిధిలోని ఇందిరానగర్లో డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్రెడ్డితో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. స్థానికంగా డ్రైనేజీ, తాగునీటి సమస్యలున్నాయని ఎమ్మెల్యే దృష్టికి స్థానికులు తీసుకు వచ్చారు.
స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు పరిష్కరించడమే ధ్యేయంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందిరానగర్ వాసులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పనకు శ్రీకారం చుట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇందిరానగర్లో వెంటనే తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులకు ఆయన సూచించారు.
కూకట్పల్లి నియోజకవర్గంలో ఇప్పటికే అనేక కోట్ల రూపాయల నిధులు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలలో ట్రాఫిక్ ఇబ్బందులు నివారించడం కోసం ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, ఆర్వోబీలు నిర్మిం చి ప్రజలకు అంకితం చేసినట్లు ఆయన చెప్పారు. నియోజకవర్గం ప్రజలకు తాగునీటి వ్యవస్థను మెరుగు పరచడం కోసం రిజర్వాయర్లు నిర్మించి తాగునీటి సదుపాయాల లోపాలను సవరించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో భవిష్యత్ తరాలు సైతం గుర్తుంచుకునేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ పాలన అందిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో జలమండలి మేనేజర్ వెంకటేశ్వర్రావు, కాలనీ అధ్యక్షుడు వెంకట్రెడ్డి, స్థానికులు పాల్గొన్నారు.