వనస్థలిపురం, డిసెంబర్ 22 : రూ.10 కోట్లతో త్రినేత్రాంజనేయ దేవస్థానం పరిసరాలను అభివృద్ధి చేస్తున్నామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. బుధవారం సాహెబ్నగర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఆరు వందల ఏండ్ల చరిత్ర కలిగిన ఆలయ విశిష్టతను కాపాడేందుకు మంత్రి కేటీఆర్ను ఒప్పించి హెచ్ఎండీఏ ద్వారా నిధులు మంజూరు చేయించామని తెలిపారు. అందమైన ప్రకృతి, గోశాల, కల్యాణమండపం, అయ్యప్ప భక్తులకు వసతి లాంటివి ఏర్పాటు చేస్తామన్నారు.
కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ కొత్త శ్రీధర్గౌడ్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అనిల్ చౌదరి, ఉమేష్గౌడ్, రవీందర్గౌడ్, మాధవరం నర్సింహారావు, గంగం శివశంకర్, యంజాల భిక్షపతి, సురేష్గౌడ్, కొంగర మహేష్, సువర్ణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.