Minister Talasani | ఎంతో చరిత్ర కలిగిన లాల్ దర్వాజ సింహవాహిణి ఆలయ అభివృద్ధి పనులను త్వరలోనే ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శనివారం సింహవాహిణి ఆలయ నూతన కమిటీ సభ్యులు మంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారు.
మంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. మంత్రి మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి, విస్తరణ పనుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.10కోట్ల మంజూరు చేశారని చెప్పారు. ఆలయ అభివృద్ధి కోసం పరిసరాలలోని స్థల సేకరణ ప్రక్రియ జరుగుతుందని, అది పూర్తి కాగానే పనులను చేపట్టనున్నట్లు వివరించారు. మంత్రిని కలిసిన వారిలో చైర్మన్ రాజేందర్ యాదవ్, ప్రధాన కార్యదర్శి మారుతి రావు, కోశాధికారి సురేందర్ ముదిరాజ్, అరవింద్ కుమార్ గౌడ్ తదితరులు ఉన్నారు.