సిటీబ్యూరో, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ)/ అంబర్పేట : నగరంలో వరదల వల్ల గతంలో తలెత్తిన సమస్యలు పునరావృతం కాకుండా వరద నివారణకు శాశ్వత పరిషారం చేయనున్నట్లు రాష్ట్ర పురపాలక, పట్టణ అభివృద్ధి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఎన్డీపీ) ద్వారా రూ. 68.40కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న హుస్సేన్ సాగర్ సర్ప్లస్ నాలాపై కవాడిగూడ నుంచి మూసీ నది వరకు చేపట్టిన పనులకు మంత్రి కేటీఆర్ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ గత సంవత్సరం అక్టోబర్లో కురిసిన భారీ వర్షాలతో హుస్సేన్సాగర్ సర్ ప్లస్ నాలా వరద వలన నల్లకుంట, అంబర్ పేట్, అశోక్ నగర్, ముషీరాబాద్ ప్రాంత ప్రజలు ఇబ్బందులు ఎదురొన్నారన్నారు. ఆ సమయంలో హుస్సేన్ సాగర్ నుంచి మూసీ నది వరకు ఇరువైపులా 12 కిలోమీటర్ల రిటైనింగ్ వాల్ నిర్మించినట్లయితే వరద సమస్యకు శాశ్వత పరిషారం దొరుకుతుందని ప్రజలు విన్నవించారని చెప్పారు. గత ప్రభుత్వాల హయాంలో ఈ నాలాకు 3 కిలోమీటర్లు మాత్రమే రిటర్నింగ్ వాల్ నిర్మించారని, 70 ఏండ్లలో ఎలాంటి నాలా అభివృద్ధి చేయలేదన్నారు. ఈ నేపథ్యంలోనే ఎస్ఆర్డీపీ మాదిరిగా ఎస్ఎన్డీపీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి విన్నవించామని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఎస్ఎన్డీపీలో మొదటి దశ కింద రూ.858 కోట్ల వ్యయంతో నగరంలో అకాలవర్షాలకు అత్యంత ఎకువగా వరదలకు గురవుతున్న ప్రాంతాలను గుర్తించినట్లు చెప్పారు.
టార్గెట్ జూన్
మొదటిదశలో జీహెచ్ఎంసీ పరిధిలోనే కాకుండా చుట్టుప్రకల ఉన్న పట్టణ ప్రాంతంలో కూడా నాలాల అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి వివరించారు. జీహెచ్ఎంసీ పరిధిలో రూ.633కోట్లతో 30 పనులు, ఓఆర్ఆర్ పరిధిలో లోపల ఉన్న మున్సిపాలిటీలలో రూ.225 .12 కోట్లతో 22 పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. హుస్సేన్ సాగర్ సర్ప్లస్ నాలా పనులు రూ.68.40కోట్ల వ్యయంతో హుస్సేన్సాగర్ నుంచి మూసీ నది వరకు 9 కిలోమీటర్ల నాలా రిటైనింగ్వాల్ చేపడుతున్నామని కేటీఆర్ అన్నారు. ఈ నాలా రిటైనింగ్ వాల్ నిర్మాణం వలన 400 ఆస్తులు కోల్పోతుండగా ప్రజల ఇబ్బందులను గమనించి 20 ఆస్తులకు కుదించనట్లు తెలిపారు. వారికి కూడా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వరద సమస్య శాశ్వత పరిషారానికి ప్రజలు పూర్తి సహకారం అందించాలని, శాసనసభ్యులు, కార్పొరేటర్లు ఈ పనులను ఎప్పటికప్పుడు సమీక్షించి వేగవంతం చేయాలన్నారు. వచ్చే జూన్ నాటికి రక్షణ గోడ పనులు పూర్తి చేయాలని అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
దేశంలో ఎక్కడా జరగని విధంగా హైదరాబాద్ అభివృద్ధి: మంత్రి తలసాని
దేశంలో ఎకడా జరగని అభివృద్ధి హైదరాబాద్ నగరంలో జరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నాలా రిటర్నింగ్ వాల్ వలన వరద ప్రమాదం నుంచి విముక్తి కలుగుతుందని అన్నారు. హైదరాబాద్ ప్రజల అవసరాలను గుర్తించి మంత్రి కేటీఆర్ నిధులు మంజూరు చేస్తున్నారని చెప్పారు. ప్రజల పూర్తి సహకారం అందించాలని ఈ సందర్భంగా మంత్రి తలసాని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, ముషీరాబాద్, అంబర్పేట్ శాసనసభ్యులు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, బీసీ కమిషన్ సభ్యుడు కిశోర్ గౌడ్, జీహెచ్ఎంసీ కమిషనర్ డి. ఎస్ లోకేశ్కుమార్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, సీఈ వసంత, జియాఉద్దీన్, ఎస్ఎన్డీపీ పర్యవేక్షణ ఇంజినీర్ భాసర్ రెడ్డి, కార్పొరేటర్లు విజయ్ కుమార్ గౌడ్, లావణ్య, రచన, పావని, మహాలక్ష్మి రమణగౌడ్, అమృత, ఉమారాణి, ఎస్.ఎన్.డి.పి ఇంజినీర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మహా ఉపశమనం