మన్సూరాబాద్, డిసెంబర్ 23: మూసీ పరీవాహక ప్రాంతాల్లోని కాలనీల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నట్లు ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. ఆదర్శనగర్, నాగోల్ విలేజ్, అరుణోదయకాలనీ, శ్రీనివాసకాలనీ, రాజ్యలక్ష్మి కాలనీ, లక్ష్మీనర్సింహ కాలనీ, న్యూ ఫతుల్లాగూడ, నువ్వులబండ, బ్లైండ్స్కాలనీ, జైపురికాలనీ, ఆప్కోకాలనీల్లో రూ.4.62 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులకు శుక్రవారం స్థానిక కార్పొరేటర్ చింతల అరుణతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్ఎన్డీపీ ప్రాజెక్టులో భాగంగా బండ్లగూడ ఎగువ, దిగువన చేపట్టిన పనులు ఇప్పటికే 75శాతం పూర్తయ్యాయని దీంతో సమస్యాత్మక ప్రాంతాల్లో వరదముప్పు సమస్య పరిష్కారం అయ్యిందని తెలిపారు. పేదలు నివసించే ఫతుల్లాగూడ సర్వే నం.58లో నివసించే ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే కాకుండా అక్కడి భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఫతుల్లాగూడలో మహిళా భవన నిర్మాణం, బస్తీ దవాఖాన ఏర్పాట్ల ప్రక్రియ త్వరలో పూర్తి చేసి ఇక్కడి నివాసితులకు పట్టాలు అందిస్తామని తెలిపారు.
రాజకీయాలు, పార్టీలకతీతంగా కాలనీలను అభివృద్ధి చేస్తున్నానని తెలిపారు. నాగోల్ వెంకటరమణకాలనీ, పద్మావతికాలనీ, బీకేరెడ్డినగర్, వెంకట్రెడ్డినగర్, శ్రీవెంకటరమణ కాలనీ, సాయిరాంనగర్, న్యూమమతానగర్, గ్రీన్ఫీల్డ్కాలనీల నుంచి నూతనంగా ఏర్పాటు చేయనున్న ట్రంక్లైన్ నిర్మాణంపై కాలనీవాసులు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారని తెలిపారు. స్థానిక కార్పొరేటర్, సదరు కాలనీవాసులతో కలిసి సదరు ప్రాంతాల్లో త్వరలో పర్యటించి వారి అభ్యంతరాలను నివృత్తి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాగోల్ డివిజన్ అధ్యక్షుడు తూర్పాటి చిరంజీవి, ఆదర్శ్నగర్ కాలనీ అధ్యక్షుడు ఎస్. రాజగోపాల్ రెడ్డి, ఉపాధ్యక్షులు కె. రామచంద్రారెడ్డి, నరేందర్ పటేల్, ప్రధాన కార్యదర్శి సీహెచ్ సద్గురు రెడ్డి, శ్రీనివాసకాలనీ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, కార్యదర్శి నర్సింహారెడ్డి, సభ్యులు సతీశ్, ప్రీతం రెడ్డి, కరుణాకర్ రెడ్డి, హేమలత, శ్రీసాయినారాయణ కాలనీ అధ్యక్షుడు డి.రమేశ్, ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి, కృష్ణానగర్ కాలనీవాసులు శ్రీనివాసాచారి, శ్రీకాంత్శర్మ, రాజవర్ధన్ రెడ్డి, ఆప్కోకాలనీ అధ్యక్షుడు కాల్వ అరవింద్ రెడ్డి, కార్యదర్శి కృష్ణారెడ్డి, జైపురికాలనీ అధ్యక్షుడు శ్యామల యాదగిరి, ప్రధాన కార్యదర్శి రాహుల్ పోతాని, కోశాధికారి బండ వేణుగోపాల కృష్ణ, ఉపాధ్యక్షుడు రాసమల్ల శ్రీనివాసులు, సభ్యులు పగిడిమర్రి శంకర్, నాయకులు తూర్పాటి కృష్ణ, గోల్కొండ మైసయ్య, చెరుకు జంగయ్య గౌడ్, కట్ట ఈశ్వరయ్య గౌడ్, సుధాకరాచారి, గవ్వ శ్యాంసుందర్ రెడ్డి, తూర్పాటి సతీశ్, పద్మారెడ్డి, వినోద్ రెడ్డి, డప్పు రాజు, రావుల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.