శేరిలింగంపల్లి : నియోజకవర్గంలోకాలనీలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని శేరిలింగంపల్లి శాసనభ్యులు ఆరెకపూడి గాంధీ అన్నారు. ఆదివారం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నలగండ్ల కాలనీలో హిమసాయి అపార్టుమెంట్ క్లబ్ హౌజ్లో జరిగిన అత్మీయ సమావేశంలో ఆయన ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హిమసాయి అపార్టుమెంట్ వద్ద నెలకొన్న డ్రైనేజీ సమస్య పరిష్కారానికి త్వరలో చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. అనంతరం రోడ్డు మరమత్తులు చేపట్టి ఆదర్శవంత కాలనీగా తీర్చిదిద్దుతానన్నారు. కాలనీ అధ్యక్షుడు మంత్రిప్రగడ సత్యనారాయణతో పాలు పలువురు నాయకులు పాల్గొన్నారు.