Nampally Accident | నగర పరిధిలోని నాంపల్లి బజార్ఘాట్లో సోమవారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో తొమ్మిది వరకు తొమ్మిది ప్రాణాలు కోల్పోయారు. అగ్నికీలలకు నాలుగు నెలల చిన్నారి సైతం బలైంది. చిన్నారి సహా ఆరుగురు ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
మృతులను ఎండీ ఆజాం (58), రెహానా సుల్తానా (50), ఫైజా సమీన్ (26), తాహూరా ఫరీన్ (35), తూబా (6), తరూబా (13), ఎండీ జకీర్ హుస్సేన్ (66), హసిబ్ -ఉర్-రహ్మాన్ (32), నికత్ సుల్తానా (55)గా గుర్తించారు. మృతుల్లో బీడీఎస్ డాక్టర్ తాహూరా ఫర్హీన్ ఈ బిల్డింగ్లో నివాసం ఉండరని.. సెలవుల నేపథ్యంలో పిల్లలను తీసుకొని బంధువుల ఇంటికి వచ్చారని పోలీసులు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వివరించారు.