Bonalu | హైదరాబాద్ : లష్కర్ బోనాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి ఆహ్వానించినట్లు డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ తెలిపారు. శుక్రవారం ఆయన సీఎం కేసీఆర్ను ప్రగతి భవన్లో కలిశారు. ఈ నెల 9న జరిగే బోనాల వేడుకలకు హాజరు కావాలని ఆహ్వానించారు. పద్మారావుగౌడ్ వెంట తన కుమారులు కిషోర్కుమార్, రామేశ్వర్గౌడ్, త్రినేత్రగౌడ్లు ఉన్నారు.
ఆదివారం ఉదయం 4 గంటలకు అమ్మవారికి తోలిబోనం సమర్పించడం జరుగుతుంది. బోనాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మన సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర పండుగగా ప్రకటించారని, నాటి నుండి ఆయన ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తూ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు.