విద్యతోనే సామాజిక అసమానతలు పూర్తిగా దూరం అవుతాయని డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకొని తార్నాక విజయ డెయిరీ క్వార్టర్స్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, లాలాపేట గడి పాఠశాలలో ‘మన బస్తీ – మన బడి’ పథకం ఫేస్-2లో జరుగుతున్న అభివృద్ధి పనులను బీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు మోతె శోభన్రెడ్డితో కలిసి ఆమె పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన విద్యా వేడుకల్లో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని చిన్నారులకు బుక్స్, యూనిఫామ్లను అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ… ‘మన బస్తీ – మన బడి’ కార్యక్రమంతో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. గురుకుల పాఠశాలల అభ్యున్నతికి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
– అడ్డగుట్ట/మారేడ్పల్లి/బొల్లారం, జూన్ 20 :
సీతాఫల్మండిలో…
విద్యా దినోత్సవం సందర్భంగా సీతాఫల్మండి డివిజన్లోని ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కళాశాలలో జరిగిన వేడుకల్లో స్థానిక కార్పొరేటర్ సామల హేమ పాల్గొని చిన్నారులకు బుక్స్, యూనిఫామ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల పిన్సిపాల్ కృష్ణమూర్తి, జూనియర్ కళాశాల ఇన్చార్జి పిన్సిపల్ కవిత, బాలరాజు, రేణుక, పద్మావతి, ధనలక్ష్మి, బబిత, విద్యార్థులు పాల్గొన్నారు.
రెజిమెంటల్బజార్లో…
రెజిమెంటల్బజార్లోని నంబర్-1 ప్రభుత్వ పాఠశాలలో విద్యా వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా దివంగత నేత ఎమ్మెల్యే జి. సాయన్న కుమార్తెలు లాస్యనందిత, నివేదితలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ….విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బిస్కెట్ ప్యాకెట్లు, కూల్డ్రింక్స్ బాటిల్స్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు టీఎన్ శ్రీనివాస్, పనస సంతోష్, మురళీ యాదవ్, భాస్కర్ ముదిరాజ్ పాల్గొన్నారు.
మోండా మార్కెట్లో..
మోండా మార్కెట్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక మాజీ కార్పొరేటర్ ఆకుల రూప హాజరై పాఠశాల ఆవరణలో మొక్కలను నాటారు.
బొల్లారం,తిరుమలగిరిలో..
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిచాలన్నదే సీఎం కేసీఆర్ ఆశయమని రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ చైర్మన్ మన్నె క్రిశాంక్ అన్నారు. తిరుమలగిరి ప్రభుత్వ పాఠశాలలో ఈనెల 27న తన జన్మదినాన్ని పురస్కరించుకొని గిప్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా లాల్బజార్ ప్రభుత్వ బాలికల పాఠశాలలో విద్యార్థులకు నోట్బుక్స్ అందజేశారు.ఈ కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యురాలు భాగ్యశ్రీ శ్యామ్ కుమార్,అనురాధ, సునీత, విశ్వనాథ్,రాజిరెడ్డి,మోని,రఘు,సాయి పాల్గొన్నారు.
బొల్లారంలో..
బొల్లారం సదర్ బజార్,రిసాల బజార్,పయనీర్ బజార్ లోని ప్రభుత్వ పాఠశాల్లో జాతీయ జెండా ఎగుర వేశారు.అనంతరం సదర్ బజార్ పాఠశాల నుంచి బొల్లారం బజార్ వరకు విద్యార్థులు ర్యాలీ చేపట్టారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సీహెచ్,శ్రీలత,రిసాల బజార్ బీఆర్ ప్రభుత్వ పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు శివ ప్రసాద్,పయనీర్ బజార్ ప్రధానోపాధ్యాయులు బి.ప్రభాకర్,ప్రధానోపాధ్యాయలు సునీల్ కుమార్,సంజీవ్ రావు, టీకే.ఇందిర, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో సకల వసతులు
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సకల వసతులతో సర్కార్ విద్యను అందిస్తున్నట్లు మల్కాజిగిరి పార్లమెంట్, కంటోన్మెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. కంటోన్మెంట్ నాలుగో వార్డు పికెట్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా విద్యా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మర్రి రాజశేఖర్రెడ్డి హాజరై మాట్లాడుతూ…. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తున్న ‘మన ఊరు-మన బడి’ పథకంతో సర్కారు బడులు కొత్త రూపు సంతరించుకున్నాయన్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్కు ధీటుగా వసతులు, ఇంగ్లిష్ మీడియంలో బోధన, సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం, ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ పంపిణీ చేశారు. అనంతరం పదో తరగతిలో అధిక మార్కులను సాధించిన విద్యార్థులను మర్రి రాజశేఖర్రెడ్డి అభినందిస్తూ..వారికి సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు మహేశ్వర్రెడ్డి, నాయకులు శ్రీకాంత్, గంగారాం, శ్రీరామ్, లడ్డు, పాఠశాల ప్రిన్సిపల్ చాముండేశ్వరి తదితరులు పాల్గొన్నారు.