మేడ్చల్ మల్కాజిగిరి : మేడ్చల్ మున్సిపల్ పరిధిలో నిర్మించిన పలు అక్రమ కట్టడాలను మున్సిపల్ అధికారులు మంగళవారం కూల్చివేశారు(Demolition). పీర్జాదిగూడ(Peerjadiguda) సాయి ప్రియ కాలనీలో ప్రభుత్వ స్థలాల్లో(Government places) చేపట్టిన నిర్మాణాలను కూల్చివేశారు. కొంతమంది స్థిరాస్తి వ్యాపారులు సీలింగ్ భూములను ప్లాట్లుగా చేసి విక్రయాలు చేపట్టారు. దీంతో రంగంలోకి దిగిన మున్సిపల్ అధికారులు అక్రమాలపై కొరడా ఝులిపించారు. కాగా, ఎంతటి వారైనా సరే అక్రమ నిర్మాణాలకు పాల్పడితే ఉపేక్షించబోమని టౌన్ ప్లానింగ్ అధికారులు హెచ్చరించారు.