కోటి హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞంకు హాజరుకావాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అహ్వాన పత్రిక అందజేస్తున్న ప్రతినిధులు
చర్లపల్లి, జనవరి 5: కోటి హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతూ ప్రతినిధులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అహ్వాన పత్రికను అందజేశారు. కోటి హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం కమిటీ చైర్మన్ నందనంపాటి రామాంజనేయులు, విశ్వహిందూ పరిషత్ జాతీయ కోఆర్డినేటర్ రాఘవులు, మాజీ లేబర్ కమిషనర్ శ్రీనివాసులు రాష్ట్రపతిని కలిసి మహాయజ్ఞంకు రావాలని కోరారు.
అనంతరం, ఈసీఐఎల్ చౌరస్తాలోని సోలీస్ కంటి వైద్యశాలలో వారు మాట్లాడుతూ.. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్ స్టేడియం లో ఈ నెల 21న తిరుమల తిరుపతి దేవస్థానం, హనుమంత్ దీక్ష పీఠం పీఠాధిపతి శ్రీ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో కోటి హనుమాన్ చాలీసా పా రాయణంను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పా ట్లు పూర్తి చేశామని తెలిపారు. కార్యక్రమంలో ఆహ్వాన కమిటీ కో కన్వీనర్, అశ్విని హెయిర్ ఆయిల్ ఎండీ సుబ్బారావు పాల్గొన్నారు.