అమీర్పేట్, ఏప్రిల్ 10 : భారతీయ యోగా సంస్థాన్ 56వ స్థాపన దినోత్సవాలు సనత్నగర్ పారిశ్రామికవాడ పార్కులో ఘనంగా జరిగాయి. సంస్థాన్ డిస్ట్రిక్ట్-1 అధ్యక్షుడు వర్జన్నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ అన్నపూర్ణ ముఖ్యఅతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా బీకేగూడ పార్కు, వినాయక్ గ్రౌడ్స్ లోదా అపార్ట్మెంట్స్, సనత్నగర్ పారిశ్రామికవాడ పార్కులోని ఉదయం, సాయంత్రం బ్యాచ్లకు చెందిన యోగా సాధకులు పెద్దసంఖ్యలో విచ్చేసి సామూహిక సాధన చేశారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ మాట్లాడుతూ దైనందిన జీవితంలో ఒత్తిడిని జయించేందుకు యోగా, ధ్యానం వంటి అంశాలను నిత్యం సాధన చేయడం ఉత్తమమన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ ఇన్చార్జిలు కుసుమ, గణనాథం, రేఖ, శారద, శాస్త్రి, చంద్రశేఖర్, ప్రభాకర్, రోజారమణి, బాలు, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.