ఉస్మానియా యూనివర్సిటీ/మారేడ్పల్లి, నవంబర్ 29: తెలంగాణ ఉద్యమ గతిని మార్చిన చారిత్రక ఘట్టం. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలు నెరవేరేందుకు కారణమైన కేసీఆర్ ఆమరణ దీక్ష ప్రారంభించిన రోజును పురస్కరించుకుని దీక్షా దివస్ను మంగళవారం తార్నాకలో ఘనంగా జరుపుకున్నారు. తార్నాకలోని డిప్యూటీ మే యర్ క్యాంపు కార్యాలయం వద్ద డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత , టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు శోభన్రెడ్డి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కేసీఆర్ తన ప్రాణాన్ని లెక్క చేయ కుండా రాష్ట్ర సాధనకు కదిలిన రోజు అని అన్నా రు.