సిటీబ్యూరో, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో 14వ రోజు 274 కేంద్రాల్లో 30,173 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. అందులో 7992 మందికి రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేయగా, 4114 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ కోసం సిఫారసు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్ జిల్లాలో 115 కేంద్రాల్లో మొత్తం 12,287 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు వారిలో 4112 మందికి రీడింగ్ గ్లాసెస్ను పంపిణీ చేయగా,1663 మంది రోగులకు ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ను సిఫారసు చేసినట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి తెలిపారు.రంగారెడ్డి జిల్లా పరిధిలో 80 కేంద్రాల ద్వారా 9758 మందికి పరీక్షలు చేశారు. మేడ్చల్ జిల్లా పరిధిలో 79 కేంద్రాల ద్వారా 8128 మందికి పరీక్షలు చేశారు.