అమీర్పేట్, సెప్టెంబర్ 22: ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దసరా షాపింగ్ బొనాంజ ఉత్సవాల్లో తొలిరోజు డ్రాలో ఐదుగురు విజేతలను ఎంపిక చేశారు. గురువారం అమీర్పేట్లోని చందనాబ్రదర్స్ షాపింగ్ మాల్లో జరిగిన కార్యక్రమంలో ఎండీ సురేశ్, ‘నమస్తే తెలంగాణ’ ఏజీఎంలు రాములు, రాజిరెడ్డిలతో పాటు చందనాబ్రదర్స్ షాపింగ్ మాల్లో కొనుగోలు చేసేందుకు వచ్చిన కస్టమర్లతో కలిసి డ్రా తీశారు. విజేతలుగా నిలిచిన వారిలో ముగ్గురు కూకట్పల్లి కేఎల్ఎంలో షాపింగ్ చేసిన వారు కాగా, ఒకరు ఎంకేఆర్ డెవలపర్స్, మరొకరు కలశ జ్యువెల్లర్స్లో షాపింగ్ చేసిన వారున్నారు.
కార్యాలయంలో బహుమతులు పొందవచ్చు..
దసరా బొనాంజాలో ఎంపికైన విజేతలు ‘నమస్తే తెలంగాణ’ ప్రధాన కార్యాలయంలో తమ బహుమతులను అందుకోవచ్చని మార్కెటింగ్ విభాగం ఏజీఎంలు రాములు, రాజిరెడ్డి తెలిపారు. విజేతలకు ఫోన్ ద్వారా సమాచారం అందిస్తామన్నారు.
ఆసక్తిగా గమనిస్తుంటాం..
‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణటుడే’లు వివిధ వ్యాపార సంస్థల భాగస్వామ్యంతో నిర్వహించిన దసరా బొనాంజాను ప్రతి సంవత్సరం ఆసక్తిగా పరిశీలిస్తుంటామని పంజాగుట్టకు చెందిన అభిరామ్, గాయత్రి దంపతులు పేర్కొన్నారు. అమీర్పేట్ చందనాబ్రదర్స్ షాపింగ్ మాల్లో దుస్తుల కొనుగోలుకు వచ్చిన ఈ దంపతులు ‘నమస్తే తెలంగాణ’తో తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. డ్రాలో విజేతలుగా ఎంపికైన వారికి శుభాకాంక్షలు తెలిపారు. తాము కూడా షాపింగ్ చేసిన తరువాత అందుకునే కూపన్లను ఇక్కడి బాక్సులో డ్రాప్ చేసి డ్రాలో పాల్గొంటామని తెలిపారు. ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’లకు తాము నిత్య పాఠకులమని చెబుతూ.. కేంద్ర, రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి వాస్తవ పరిస్థితులను పాఠకుల ముందు ఉంచడంలో ఆ ప్రతికలు చేస్తున్న కృషి అమోఘమన్నారు.
ఆనందంగా ఉంది..
‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దసరా బొనాంజా లక్కీ డ్రా విజేతలను ఎంపిక చేసే అవకాశాన్ని కల్పించినందుకు ఆనందంగా ఉంది. చందనాబ్రదర్స్లో షాపింగ్ చేసేందుకు వచ్చిన నాకు లక్కీ డ్రాలో ఐదో విజేతను ఎంపిక చేసే అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు. కుటుంబ సభ్యులంతా కలిసి అవసరమైన దుస్తులు, జ్యువెల్లరీ కొనుగోలు చేసేందుకు ఎక్కువగా సీబీఎస్కు వస్తుంటాం. లక్కీ డ్రాలో విజేతలుగా నిలిచిన వారికి శుభాకాంక్షలు.
– మానస, ఎస్ఆర్నగర్
సుదీర్ఘకాలంగా అనుబంధం..
‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’లతో చందనాబ్రదర్స్ షాపింగ్ మాల్ అనుబంధం సుదీర్ఘకాలంగా కొనసాగుతోందని సీబీఎస్ ఎండీ సురేశ్ అన్నారు. ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ల ఆధ్వర్యంలో జరిగే దసరా బొనాంజా పట్ల కస్టమర్లు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారని, గతంలో కంటే ఈ సంవత్సరం కస్టమర్ల ఆదరణ మరింత పెరిగిందన్నారు. ఈ సంవత్సరం దసరా బొనాంజా తొలి డ్రా విజేతల ఎంపికకు చందనాబ్రదర్స్ షాపింగ్ మాల్ వేదిక కావడం తమకు ఆనందంగా ఉందని చెప్పారు. సకుటుంబ సమేతంగా దసరా షాపింగ్ చేసేందుకు వచ్చే వారికి సీబీఎస్ షాపింగ్మాల్లో అన్ని రకాల ఫ్యాషన్లు, పిల్లలు, పెద్దలు, మహిళలు, ప్రత్యేకంగా యువతులు కోరుకునే అన్ని రకాల ఫ్యాషన్ దుస్తులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని, వివిధ ఆఫర్లతో పాటు కాంబో ఆఫర్లను అందిస్తున్నామని తెలిపారు. ప్రతి వెయ్యి రూపాయల కొనుగోళ్లపై కూపన్లు ఇస్తున్నామని, వీటిని మాల్లో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్సుల్లో వేసి.. బొనాంజాలో పాల్గొనవచ్చన్నారు.
తొలిరోజు విజేతలు వీరే..
మొదటి బహుమతి: టి.హర్షిత్ బాబు -7799366113 (కూకట్పల్లి కేఎల్ఎం షాపింగ్ మాల్)
రెండో బహుమతి: హరిత -8242188860(కలశ జ్యువెల్లర్స్)
మూడో బహుమతి: ఎం.స్వాతి-9052432525(ఎంకేఆర్ డెవలపర్స్ సంస్థ)
నాలుగో బహుమతి: జీసీహెచ్. మౌనిక -9989707333,(కూకట్పల్లి కేఎల్ఎం షాపింగ్ మాల్)
ఐదో బహుమతి: కె.సాయిరామ్ -7842724090 (కూకట్పల్లి కేఎల్ఎం షాపింగ్ మాల్)