దళితబంధు పథకంలో మంజూరైన ఆటో ట్రాలీని లబ్ధిదారుకు అందజేసిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి
ఎల్బీనగర్, జూన్ 6 : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం చరిత్రాత్మకమని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. కొత్తపేట డివిజన్ మారుతీనగర్కు చెందిన రమేశ్కు సోమవారం దళితబంధు పథకంలో మంజూరైన ఆటో ట్రాలీ తాళం చెవిని అంబేద్కర్ చిత్రపటంతో కలిపి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దళితుల సాధికారత కోసమే దళిత బంధు పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం రుపొందించిందని తెలిపారు.
ఎల్బీనగర్ నియోజకవర్గంలోని 100 మందికి ఈ పథకం అమలు చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ మున్సిపాలిటీ మాజీ వైస్చైర్మన్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు లింగాల నాగేశ్వర్రావు, కొత్తపేట డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు లింగాల రాహుల్గౌడ్, నాయకులు శ్రీనివాస్, భాస్కర్ యాదవ్, రామాచారి, లబ్ధిదారుడు రమేశ్, తల్లి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.