హిమాయత్నగర్,సెప్టెంబర్6 : రాష్ట్రంలోని దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు దళితబంధు పథకం ఎంతో దోహదపడుతుందని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్య క్షుడు వడ్లమూరి కృష్ణ స్వరూప్ స్పష్టం చేశారు. సోమవారం హిమాయత్నగర్లో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు.
దళిత బంధు పథకం అమలు కాకుండా బీజేపీ,కాంగ్రెస్ పార్టీల నాయకులు అడ్డుకునేందుకు ప్రయత్నం చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడంతో పాటు బీసీ,మైనార్టీ వర్గాలకు ఈ బంధును వర్తింపజేయాలని ప్రభుతానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని దళితులు ఐక్యతతో ముందుకు సాగి హక్కులను సాధించుకోవాలని పిలుపు నిచ్చారు.ఈ సమావేశంలో పార్టీ నాయకులు చేపూరి రాజు, ఇటికాల గణేష్, ప్రవీణ్ కుమార్, వరలక్ష్మి,రాజు, రాము,శ్రీనివాస్ పాల్గొన్నారు.