జీడిమెట్ల,ఆగస్టు4: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అన్నారు. గురువారం గాజులరామారం డివిజన్ పరిధి లాల్సాబ్గూడకు చెందిన బి.శ్రీనివాస్రాజు, బి.కుమార్లు చింతల్ డివిజన్ పరిధి శ్రీనివాస్నగర్ కాలనీలో దళిత బంధు పథకం ద్వారా ఏర్పాటు చేసిన తేజస్వీనిఇంజినీరింగ్, ఫ్యాబ్రికేషన్ , ఫ్లోర్ మిల్లును ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దళితులు ఆర్థికంగా అభివృద్ధి చేందేందుకు సీఎం కేసీఆర్ దళిత బంధు ప్రవేశపెట్టి వారి కుటుంబాలను ఆదుకుంటున్నారన్నారు. దళిత బంధు ద్వారా లబ్ధ్దిపొందిన కుటుంబాలు ఆర్థిక స్వాలంబన దిశగా అడుగులు వేస్త్తాయన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ టి.లక్ష్మారెడ్డి, మాజీ కౌన్సిలర్ కిషన్రావు, నాయకులు మక్సూద్ అలీ, బస్వరాజు, శేఖర్రావు, ప్రభాకర్గుప్త, వెంకటేశ్గౌడ్, ప్రకాశ్, సత్యనారాయణ, బుచ్చన్న , జేమ్స్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిశీలన
దుండిగల్,ఆగస్టు 4: శాంతి భద్రతలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే వివేకానంద్ అన్నారు. బాచుపల్లిలో రూ.5 కోట్ల సీఎస్ఆర్ నిధులతో నిర్మిస్తున్నట రాష్ట్రంలోనే అతిపెద్దదైన మోడల్ పోలీస్స్టేషన్ను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్స్టేషన్లను ఆధునీకరించడంతో పాటు ఉత్తమ పౌర సేవలు అందించేందుకు కృషి చేస్తున్నారని, టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వేలాది పోలీస్ ఉద్యోగాల నియామకాలు జరిగాయని, శాంతి భద్రతల పరిరక్షణే ద్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు.అధునాతన హంగులతో రూపుదిద్దుకుంటున్న ఈ పోలీస్స్టేషన్కు సంబంధించిన వివరాలను సీఐ నర్సింహారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద్కు వివరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు కొలన్ వీరేందర్రెడ్డి,ఆగం రాజు, టీఆర్ఎస్ నాయకులు మారయ్య,వేణుయాదవ్,శ్రీకర్గుప్త ఉన్నారు.