గౌతంనగర్, జనవరి 31: దళిత బంధు పథకం దేశానికే ఆదర్శమని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. దళిత బంధు పథకం కింద రూ.10లక్షలు లబ్ధిపొంది వివిధ రకాల వ్యాపారాలతో జీవనోపాధి పొందుతున్న దళిత కుటుంబాలతో ఎమ్మెల్యే.. తన నివాసంలో మంగళవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతి ఒక్కరినీ అప్యాయం గా పలకరించి..వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వారందరితో కలిసి అల్పహారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దళితుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం పనిచేస్తున్నారన్నారు.
భారత దేశం అన్ని విధాలా అభివృద్ధి చేందాలంటే బీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందన్నారు. దళిత కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలంటే కేవలం దళిత బంధు పథకంతోనే సాధ్యమవుతుందన్నారు. మొదటి విడతలో దళిత బంధు పథకం కింద రూ.10లక్షలు పొందిన 100మంది కుటుంబాలను ఎమ్మెల్యే కలిశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యేను సన్మానించి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఈడీ బాలాజీ, కార్పొరేటర్ జితేంద్రనాథ్, బీఆర్ఎస్ నాయకులు మేకల రాముయాదవ్, మీడియా కన్వీనర్ గుండా నిరంజన్, ఉపేందర్రెడ్డి, ఎస్ఆర్ ప్రసాద్, సంతోష్రాందాస్, మోహన్రెడ్డి, పీఏ.శ్రీనువాస్, ఉపేందర్, రఘు, భరత్నగర్ అధ్యక్షుడు మంద భాస్కర్, చందు, దుర్గేశ్, జానీ, రాజు, బాలస్వామి, చంద్రకళ, ఉమ, ప్రమీల, సుమలత పాల్గొన్నారు.