బంజారాహిల్స్,ఫిబ్రవరి 21 : గూగుల్ టాస్క్లు(Google Task) పూర్తిచేస్తే లక్షల్లో డబ్బు సంపాదిం చవ చ్చంటూ నమ్మించిన సైబర్ నేరగాళ్లు(Cybercriminals) యువకుడిని బురిడీ( Cheated )కొట్టించిన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నరేష్ అనే యువకుడికి ఈనెల 15న గుర్తుతెలియని వ్యక్తులు వాట్సప్ద్వారా పరిచయం అయ్యారు.
టెలిగ్రామ్లో కొన్ని టాస్క్లు పూర్తిచేస్తే డబ్బులు సంపాదించవచ్చని నరేష్ను నమ్మించారు. అలెగ్జాండ్రా పేరుతో టెలిగ్రామ్లో చాటింగ్ చేస్తూ కొన్ని టాస్క్లు ఇచ్చారు. ప్రారంభంలో కొన్ని డబ్బులు డిపాజిట్ చేయడం, టాస్కులు పూర్తిచేసిన వెంటనే కొంత డబ్బు తిరిగి ఇవ్వడంతో మరింత ఎక్కువ డిపాజిట్లు చేయించడం ప్రారంభించారు.
మూడు రోజుల్లో సుమారు రూ.81వేలు డిపాజిట్ చేసిన అనంతరం మరో మూడున్నర లక్షలు పంపించాలని, లేకుంటే అప్పటిదాకా పెట్టిన డబ్బులు మొత్తం పోతాయంటూ బెదిరించారు. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన నరేష్ బుధవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.