ఎన్ఆర్ఐ వాట్సాప్ నంబర్ల హ్యాక్
మరోసారి సైబర్నేరగాళ్ల పంజా
సైబర్ నేరగాళ్లు మరోసారి పంజా విసిరారు. ఈసారి ఎన్ఆర్ఐల వాట్సాప్ నంబర్లను హ్యాక్ చేసి.. లక్షలు దోచేశారు. ఇలా మోసపోయిన నగరానికి చెందిన ఇద్దరు బాధితులు సైబరాబాద్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గచ్చిబౌలికి చెందిన శ్రీరామ్కు అమెరికాలో ఉంటున్న తన సోదరి సుజాత నంబరుతో వాట్సాప్ మెసేజ్ వచ్చింది. అందులో అత్యవసరంగా వైద్యానికి డబ్బులు అవసరముందంటూ ఉంది. ఇది నిజమని నమ్మిన శ్రీరామ్ ఈ విషయాన్ని ధ్రువీకరించుకోకుండానే మెసేజ్లో సూచించిన ఖాతాలోకి ఒకసారి రూ. 1.98 లక్షలు, మరోసారి రూ. 9 లక్షలు పంపాడు.
ఆ తర్వాత తన సోదరికి ఫోన్ చేసి ఆరా తీయగా, అలాంటిదేమి లేదని ఆమె స్పష్టం చేసింది. దీంతో మోసపోయానని గ్రహించిన శ్రీరామ్ సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరో ఘటనలో కూకట్పల్లికి చెందిన నరేంద్రకు అమెరికాలో ఉంటున్న తన చిన్ననాటి స్నేహితుడు ఫోన్ నంబరుకు ఇలాగే మెసేజ్ వచ్చింది. నరేంద్ర సైతం మెసేజ్లో సూచించిన బ్యాంక్ ఖాతాల్లోకి రూ. 10.98 లక్షలు పంపి మోసపోయాడు. బాధితుల ఫిర్యాదు మేరకు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.