హైదరాబాద్: సైబరాబాద్ కమిషరేట్లో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్షాపులపై (Belt Shops) పోలీసులు దాడులు చేశారు. కమిషనరేట్లోని 8 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎస్వోటీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 796.05 లీటర్ల మద్యాన్నీ స్వాదీనం చేసుకున్నారు. దీనివిలువ రూ.7.47 లక్షల ఉంటుందని పోలీసులు తెలిపారు. ఒక్క పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే 480 లీటర్స్ మద్యాన్ని మేడ్చల్ పోలీసులు పట్టుకున్నారు.
మోకిలా- 45.2 లీటర్లు
రాజేంద్రనగర్- 94.78 లీటర్లు
పేట్ బషీరాబాద్- 480 లీటర్లు
శామీర్పేట్- 11.25 లీటర్లు
బాచుపల్లి- 55.8 లీటర్లు
మైలార్దేవ్పల్లి- 17.4 లీటర్లు
నందిగామ- 19.14 లీటర్లు
దుండిగల్- 6.43 లీటర్లు