శేరిలింగంపల్లి, జనవరి 12: గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ), సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్(ఎస్సీఎస్సీ)లు సైబర్ భద్రతపై ఉమ్మడి సహకార పరిశోధన కార్యకలాపాలు పంచుకునేందుకు గురువారం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ కల్మేశ్వర్ సింగనవార్, ఐఎస్బీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డాటాసైన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనీష్ గంగ్వార్లు పరస్పరం అవగాహన పత్రాలపై సంతకాలు చేసి మార్చుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెరుగుతున్న సైబర్ నేరాలు సవాళ్లుగా మారుతున్న తరుణంలో సైబర్ క్రైం కేసులను ఛేదించడంలో మెరుగైన విధానాల రూపకల్పన అమలుకు ఇది ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎస్బీ డీన్ మదన్ పిల్లుట్లతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.