సిటీబ్యూరో, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వ్యాప్తంగా ఫంక్షనల్ వర్టికల్స్లో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ మొదటి స్థానంలో నిలిచిందని డీజీపీ అంజనీకుమార్ అన్నారు. నేరాల నియంత్రణ , పోలీసు దర్యాప్తు, ఫంక్షనల్ వర్టికల్స్పై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనిట్ల అధికారులతో సోమవారం ఏడీజీపీ సీఐడీ మహేశ్ భగవత్, ఉమెన్ సేఫ్టీ అండ్ షీ టీమ్స్ ఏడీజీపీ షిఖా గోయెల్తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ 2020, ఆగస్టు నుంచి ఈ ఆన్లైన్ క్రైమ్ రివ్యూ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇలాంటి రివ్యూల ద్వారా రాష్ట్రంలో పోలీసుల పనితీరు తెలుసుకోవడమే కాకుండా బాగా పనిచేసే యూనిట్ పనితీరును మరో యూనిట్ వారు ఆదర్శంగా తీసుకునేందుకు ఉపయోగపడుతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని యూనిట్లతో పోలిస్తే ఫంక్షనల్ వర్టికల్స్లో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ మొదటి స్థానంలో ఉన్నదని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రతో పాటు సిబ్బందిని అభినందించారు.
మొదటి స్థానంలో నిలిచిన అంశాలు ఇవే
సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పరిషరించడం, మహిళలు, చిన్నారులకు సంబంధించిన నేరాలను తగ్గించడం, ఫోక్సో కేసుల పరిషారం, వారెంట్ల జారీ, క్రైమ్ రైటర్, హెచ్ఆర్ఎంఎస్ఎం, టెక్ టీమ్, ట్రాఫిక్ నియంత్రణ, సైబర్ క్రైమ్, కమ్యూనిటీ పోలిసింగ్, ట్రైనింగ్స్ వంటి వాటిలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ నంబర్ -1 స్థానంలో ఉందని డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా జోనల్ డీసీపీలు, క్రైమ్ డీసీపీలు, ఎస్హెచ్ఓలను అభినందించారు. ఈ సమావేశంలో సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, జాయింట్ సీపీ అవినాశ్ మహంతి, ట్రాఫిక్ జాయింట్ సీపీ నారాయణ నాయక్, క్రైమ్ డీసీపీ సింగెన్వర్ కల్మేశ్వర్, మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి, రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, బాలానగర్ డీసీపీ శ్రీనివాసరావు, మేడ్చల్ డీసీపీ సందీప్, డీసీపీ అడ్మిన్ యోగేశ్ గౌతమ్, ట్రాఫిక్ డీసీపీ హర్షవర్ధన్, సైబర్ క్రైమ్ డీసీపీ రితిరాజ్, షీ టీమ్స్ డీసీపీ దీప్తి పంత్, రాజేంద్రనగర్ ఏడీసీపీ రష్మి పెరుమాళ్, ఈఓడబ్లూ డీసీపీ ధార కవిత, ఎస్బీ ఏడీసీపీ రవి కుమార్, తదితరులు పాల్గొన్నారు.
బంజారాహిల్స్ రోడ్ నం 14లోని ప్రైవేటు పాఠశాలలో నాలుగున్నర ఏళ్ల బాలికపై లైంగికదాడి ఘటనలో రికార్డు సమయంలో నిందితులకు శిక్ష పడటంలో మంచి పనితీరును కనబర్చిన బంజారాహిల్స్ పోలీసులతో పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ను తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ ప్రశంసించారు. సోమవారం బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ నరేందర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రతాప్రెడ్డి, రైటర్ అక్కిరెడ్డి, కోర్టు కానిస్టేబుల్ నరేశ్లను డీజీపీ ప్రత్యేకంగా అభినందించడంతో పాటు ప్రశంసాపత్రం అందించారు.