సిటీబ్యూరో, జనవరి 12 (నమస్తే తెలంగాణ): సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఆపరేషన్ ‘స్మైల్’ను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. సైబరాబాద్ ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ విభాగం డీసీపీ కవిత ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కార్మిక శాఖకు చెందిన జిల్లా సంక్షేమ అధికారి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలతోపాటు పలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో పోలీసులు స్మైల్ ఆపరేషన్ను నిర్వహిస్తున్నారు.
ఈ ఆపరేషన్లో 14ఏండ్లలోపు వయసున్న వీధి బాలలు, రోడ్లపై యాచించే వారు, బాల కార్మికులను గుర్తించి రెస్యూ హోమ్కు తరలించనున్నట్లు డీసీపీ కవిత తెలిపారు. ప్రతి సంవత్సరం జనవరి మాసంలో ఈ ఆపరేషన్ను నిర్వహిస్తామన్నారు. గత సంవత్సరం ఆపరేషన్ స్మైల్ ద్వారా 1072 మంది వీధి బాలలను రెస్క్యూ చేసి రెస్క్యూ హోమ్కు తరలించినట్లు తెలిపారు. ప్రస్తుతం కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక బృందాల ద్వారా 14ఏండ్లలోపు వయసున్న వీధి బాలలు, బాల కార్మికులు, యాచకులను గుర్తించేందుకు స్పెషల్ డ్రైవ్ను చేపట్టామని తెలిపారు.