హైదరాబాద్ : సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో సీపీ సజ్జనార్ 8 అంబులెన్స్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మీడియాతో మాట్లాడారు. సోమవారం నుంచి మరో 4 అంబులెన్స్లు అందుబాటులోకి వస్తాయన్నారు. ఐటీ సంస్థల సహకారంతో ఈ అంబులెన్స్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ అంబులెన్స్లను ఇన్స్పెక్టర్ ర్యాంక్ అధికారి పర్యవేక్షించనున్నారు. అంబులెన్స్ల సాయం కోసం 94906 17431, 94906 17440 నంబర్లను సంప్రదించాలని సూచించారు. డయాలసిస్, కొవిడ్ బాధితులకు, గర్భిణులతో పాటు అత్యవసర సేవలకు వీటిని ఉపయోగించనున్నారు. నిర్వాహకులు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.