బంజారాహిల్స్,జనవరి 7: పార్ట్టైమ్ జాబ్(Part time job) కోసం చూస్తున్న యువతిని సైబర్ నేరగాళ్లు(Cyber fraud) బురిడీ కొట్టించి డబ్బులు కాజేశారు. బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్ నెం 12లో నివాసం ఉంటున్న శైలజ మాదాపూర్లో డిజైనర్గా పనిచేస్తుంటారు. పార్ట్టైమ్ జాబ్ కోసం ఆన్లైన్లో సెర్చ్ చేస్తున్న క్రమంలో ఈనెల 3న గుర్తుతెలియని నంబర్ నుంచి మెసేజ్ వచ్చింది.
గూగుల్ రివ్యూస్, టాస్క్స్ పూర్తిచేస్తే డబ్బులు వస్తాయని నమ్మించడంతో పాటు ముందుగా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందని తెలిపారు. తమ ఇన్స్టాగ్రామ్ గ్రూపులో యాడ్ చేసి జాబ్కు సంబందించిన వివరాలు చెప్పారు. దీంతో వారి మాటలు నమ్మిన శైలజ రూ.27వేలు పెట్టుబడిగా పంపింది. అయితే రోజులు గడిచినా డబ్బులు తిరిగి రాకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించి ఆదివారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.