హైదరాబాద్ : సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. పలువురికి పెట్టుబడి పేరిట రూ.37లక్షలు కుచ్చుటోపీ పెట్టారు. నగరంలోని అమీర్పేటకు చెందిన ఓ మహిళ డ్రాగన్ హాట్ యాప్లో రూ.31లక్షలు పెట్టుబడి పెట్టింది. ఇదే తరహాలో మరో ఇద్దరు బాధితులు రూ.ఆరు లక్షలు పెట్టుబడి పెట్టారు. చివరకు మోసపోయామని భావించిన బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఉద్యోగం పేరుతో ఓ యువకుడిని బురిడీ కొట్టించారు కేటగాళ్లు. రూ.5లక్షలు ఫీజుల పేరిట వసూలు చేశారు. చివరకు మోసపోయానని గ్రహించి బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.