సిటీబ్యూరో, మార్చి 15 (నమస్తే తెలంగాణ) : ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తామంటూ నమ్మించి నగర వాసికి సైబర్నేరగాళ్లు రూ.4.5 లక్షలు టోకరా వేశారు. మెహిదీపట్నం ప్రాంతానికి చెందిన బాధితుడికి ఎంబీబీఎస్ సీటు ఆఫర్ చేస్తూ ఓ మెయిల్ వచ్చింది. బెంగళూర్లో పేరున్న కాలేజీలో సీటు ఇప్పిస్తామని ఉండటంతో బాధితుడు అందులోని ఫోన్ నంబర్కు ఫోన్ చేశాడు.
ముందుగా రూ.4.5 లక్షలు చెల్లిస్తే సీటు రిజర్వు అవుతుందని, తరువాత ఫీజులో డిస్కౌంట్ గురించి మాట్లాడుదామంటూ నమ్మించారు. వారి మాటలు నమ్మిన బాధితుడు డబ్బులు చెల్లించాడు. తర్వాత ఫోన్ స్వీచాఫ్ వచ్చింది. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
పాన్ కార్డు అప్డేట్ పేరుతో..
ఎస్బీఐలో మీ పాన్ కార్డు అప్డేట్ కాలేదని, వెంటనే కేవైసీని అప్డేట్ చేయాలంటూ జూబ్లీహిల్స్కు చెందిన రిటైర్డు ఉద్యోగికి రూ.6లక్షలు టోకరా వేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.