శంషాబాద్ రూరల్, జూలై 30: శంషాబాద్ ఎయిర్పోర్టులో ఓ ప్రయాణికుడి వద్దనుంచి ఆదివారం కస్టమ్స్ అధికారులు బంగారం స్వాధీనం చేసుకున్నారు. అధికారుల కథనం ప్రకారం.. దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన ఓ ప్రయాణికుడిపై అనుమానం రావడంతో అధికారులు తనిఖీలు చేశారు. దీంతో ఆ ప్రయాణికుడు తప్పించుకునేందుకు బాత్రూంలో బంగారాన్ని దాచి ఉంచాడు.
ఈ విషయాన్ని పసిగట్టిన అధికారులు.. సదరు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని విచారించగా బాత్రూంలో బంగారాన్ని దాచినట్లు ఒప్పుకున్నాడు. పట్టుబడిన బంగారం 1329 గ్రాములు ఉందని, ఆ బంగారం విలువ రూ.94.99 లక్షలు ఉంటుందని వివరించారు. సదరు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.