శంషాబాద రూరల్, జనవరి 6 : లోదుస్తుల్లో దాచుకొని తరలిస్తున్న బంగారాన్ని శుక్రవారం ఎయిర్పోర్టు కస్టమ్స్ అధికారులు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబాయ్ నుంచి రెండు వేర్వేరు విమానాల్లో వచ్చిన నాలుగురు ప్రయాణికులు ఎవరికీ అనుమానం రాకుండా జీన్స్ ప్యాంట్లో నడుము చుట్టూ బంగారం దాచుకొని తీసుకువచ్చారు.
కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో బంగారం బయటపడింది. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ.77 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకొని కేంద్ర కార్యాలయానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.