హైదరాబాద్: ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని షీ-టీమ్స్ (SHE Teams), హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో 5కే, 2కే రన్ను నిర్వహించారు. హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్డులో (Necklace Road) ఉన్న పీపుల్స్ప్లాజా (Peoples plaza) వద్ద 5కే, 2కే రన్ లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి (Santhi Kumari), డీజీపీ అంజనీ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. మహిళా భద్రతా, షీ-టీమ్లపై చైతన్యం తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు ఈ రన్ను నిర్వహించారు.
ఇందులో నగరంలోని యువతీ, యువకులు, మహిళా పోలీసులు, పోలీసు అధికారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ (C.V. Anand), మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీ షికా గోయల్తోపాటు పలువురు సీనియర్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు.