మేడ్చల్ రూరల్, నవంబర్ 26 : మేడ్చల్ మండలం రావల్కోల్ గ్రామ పంచాయతీ పరిధిలోని 111 సర్వే నంబర్లో నూతనంగా ఏర్పాటు చేయబోయే క్రషర్ మిషన్పై అదనపు కలెక్టర్ నర్సింహా రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ రావల్కోల్ పంచాయతీ పరిధిలో ఇప్పటికే 5 క్రషర్ మిషన్లు ఉన్నాయని, వాటితోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. క్రషర్ మిషన్లు, టిప్పర్ల రాకపోకలతో దుమ్ము ఏర్పడి ఆరోగ్యం దెబ్బతింటున్నదని వాపోయారు. పంచాయతీకి మూడు, నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న క్రషర్లతో పరిస్థితి ఇలా ఉంటే గ్రామానికి అతి సమీపంలో ఏర్పాటు చేస్తున్న క్రషర్ మిషన్తో పరిస్థితులు దారుణంగా మారుతాయన్నారు. ఈ క్రషర్ మిషన్ ఏర్పాటు చేయబోయే స్థలానికి కేవలం 700 మీటర్ల దూరంలో నిరుపేదల ఇందిరమ్మ ఇండ్లు, 2 గిరిజన తండాలు ఉన్నాయని తెలిపారు. క్రషర్ మిషన్ మాకొద్దు అని గ్రామ ప్రజలు వ్యతిరేకించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి అడిషనల్ కలెక్టర్ నర్సింహా రెడ్డి మాట్లాడుతూ ప్రజాభిప్రాయాన్ని రికార్డు చేశామని ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామన్నారు. ప్రజాభిప్రాయం మేరకే తాము ముదుకెళ్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ మహేందర్, ఎంపీటీసీ వెంకటేశ్, గిరిజన నాయకుడు ధన్రాజ్నాయక్, ఏసీపీ రామలింగరాజు, సీఐ ప్రవీణ్రెడ్డి, కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.