వెంగళరావునగర్, జూన్ 12 : ప్రజల్ని ఇబ్బందులకు గురిచేసి రోడ్డును కబ్జాచేసే అక్రమార్కులపై క్రిమినల్ కేసులు పెట్టాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ పోలీసుల్ని ఆదేశించారు. ఆదివారం పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా శ్రీనగర్కాలనీలోని జయప్రకాష్నగర్, తవక్కల్నగర్, అలీనగర్ ప్రాంతాల్లో సోమాజిగూడ కార్పొరేటర్ వనం సంగీతతో కలిసి ఆయన పర్యటించారు.
స్థానికుల సమస్యలు తెల్సుకుంటూ..అక్కడికక్కడే పరిష్కరిస్తూ ఆయన పర్యటననుముందుకు సాగించారు. అలీనగర్లో రోడ్డును దారిపొడవునా కబ్జా చేసి..స్క్రాప్ సామగ్రితో నింపేయడంతో రహదారి కుచించుకుపోయిందంటూ స్థానికులు తమ గోడును ఎమ్మెల్యే మాగంటి ఎదుట వెలిబుచ్చారు.
అక్రమణదారులు చెత్తాచెదారం నింపడంతో అక్కడ క్రిమికీటకాలు, పాములు, తేళ్లు సంచరిస్తున్నాయని..పలుమార్లు చెప్పినా ఆ కబ్జాలను తొలగించడంలో వైఫల్యం చెందారని వారు ఎమ్మెల్యే ఎదుట వాపోయారు. రోడ్లను కబ్జా చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు..చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని బల్దియా అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డీఈ చైతన్య, ఏఈ శ్రీనివాస్, వాటర్ వర్క్స్ డీజీఎం దిలీప్, డివిజన్ అధ్యక్షుడు అప్పూఖాన్, తన్నూఖాన్, శరత్ గౌడ్, మధుయాదవ్, చిన్నబాబు, మారుతి, శివకుమార్, నాగమణి, శిరీష, రాణి తదితరులు పాల్గొన్నారు.