చాంద్రాయణగుట్ట,అక్టోబర్ 8 : పెండ్లి కావడం లేదని మనస్థాపానికి గురైన ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఫలక్నుమా పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది.
శుక్రవారం ఇన్స్పెక్టర్ ఆర్.దేవేందర్ తెలిపిన వివరాల ప్రకారం..సంజయ్గాంధీనగర్లో టైలర్ పని చేసే సయ్యద్ అంజద్ (30) కుటుంబ సభ్యులు కొన్నాళ్లుగా పెండ్లి చేయడానికి సంబంధాలు చూస్తున్నారు. ఎన్ని సంబంధాలు చూసిన పెండ్లి కాకపోవడంతో కొన్ని రోజులుగా తనలో తనే మథనపడుతున్నాడు.
మనస్థాపానికి గురైన అంజద్ ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్న అంజద్ ఎంతకు తలుపులు తెరవకపోవడంతో అనుమానించిన కుటుంబ సభ్యులు తలుపులు పగలగొట్టి గదిలోకి వెళ్లి చూడగా ఫ్యాన్కు ఉరివేసుకొని మిగతజీవిగా కనిపించాడు.
వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా వైద్యశాలకు తరలించారు. కేసును ఫలక్నుమా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.