బంజారాహిల్స్ : టీ-20 వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచులపై బెట్టింగులు ఆడుతున్న వ్యక్తులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం 2లోని జవహర్కాలనీలో అన్నపూర్ణ స్టూడియో ఎదురుగా పరిడి గణేష్ (29) గణేష్ హెయిర్ స్టైల్ పేరుతో సెలూన్ నిర్వహిస్తున్నాడు.
కాగా గణేశ్ తెంబూరు హరిప్రసాద్ (28) అనే వ్యక్తితో కలిసి క్రికెట్ బెట్టింగ్స్కు పాల్పడుతున్నారని సమాచారం అందు కున్న బంజారాహిల్స్ పోలీసులు మంగళవారం రాత్రి దాడులు నిర్వహించారు. సౌత్ ఆఫ్రికా, బంగ్లాదేశ్ మ్యాచ్మీద క్రికెట్లైవ్ గురూ యాప్ద్వారా బెట్టింగ్లు స్వీకరిస్తున్నట్లు గుర్తించారు..
పోలీసులు వారివద్ద సోదాలు చేసి బెట్టింగ్లకు ఉపయోగిస్తున్న రూ.17,200నగదు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వారిపై గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్చేశారు.