నగర శివారు ప్రాంతాల్లో ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణే లక్ష్యంగా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) అడుగులు వేస్తున్నది. గ్రేటర్ చుట్టూ ఔటర్ను దాటి శివారు ప్రాంతాల్లో భారీ లేఅవుట్లను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా లేఅవుట్ను అభివృద్ధి చేయడంతో హాట్కేకుల్లా ప్లాట్ల విక్రయాలు జరిగాయి. రంగారెడ్డి జిల్లా పరిధి హయత్నగర్ సమీపంలోని తొర్రూరులో 110 ఎకరాలు, కుర్మల్గూడలో 16.30 ఎకరాల్లో, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా దుండిగల్ మునిసిపాలిటీ పరిధిలోని బహదూర్పల్లిలో 40 ఎకరాల్లో లేఅవుట్లు అభివృద్ధి చేసి రెండు దఫాలుగా ప్లాట్లను ఆన్లైన్ ద్వారా విక్రయించారు. ఈ లేఅవుట్లలో మెరుగైన వసతులు కల్పించేందుకు మొత్తం రూ.53 కోట్లను వెచ్చించాలని హెచ్ఎండీఏ కార్యాచరణ రూపొందించింది. ఉప్పల్ భగాయత్ తరహాలోనే ఈ మూడు లేఅవుట్లలో విశాలమైన రోడ్లు, తాగునీరు, సీవరేజ్ లైన్లు, విద్యుత్, పార్కులు వంటి వసతులను కల్పించనున్నారు. మాస్టర్ ప్లాన్ నిబంధనలకు అనుగుణంగా అన్ని విధాలుగా సురక్షితం కావడంతో కొనుగోలుదారులు హెచ్ఎండీఏ లేఅవుట్లకే అధిక ప్రాధాన్యనిస్తున్నారు.
– సిటీబ్యూరో, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ)
సిటీబ్యూరో, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): నగర శివారు ప్రాంతాల్లో ప్రణాళికబద్ధమైన పట్టణీకరణే లక్ష్యంగా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) చర్యలు చేపడుతున్నది. గ్రేటర్ చుట్టూ ఉన్న ఔటర్ రింగురోడ్డును దాటి శివారు ప్రాంతాల్లో పట్టణీకరణ జరుగుతున్న నేపథ్యంలో మెరుగైన మౌలికవసతుల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. రంగారెడ్డి జిల్లా పరిధి హయత్నగర్ సమీపంలోని తొర్రూరులో 110 ఎకరాలు, కుర్మల్గూడలలో 16.30 ఎకరాల్లో, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా దుండిగల్ మునిసిపాలిటీ పరిధిలోని బహదూర్పల్లిలో 40 ఎకరాలు, హెచ్ఎండీఏ నిబంధనలకు అనుగుణంగా లేఅవుట్లను అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూడు లేఅవుట్లలో రెండు దఫాలుగా ప్లాట్లను ఆన్లైన్ ద్వారా విక్రయించారు. ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణ నేపథ్యంలో ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్న భూములను అభివృద్ధి చేసి విక్రయించడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చడంతో పాటు ప్రజలకు మెరుగైన మౌలిక వసతులతో కూడిన లేఅవుట్లను అందుబాటులోకి తెస్తున్నారు.
నగర శివారు ప్రాంతాలైన తొర్రూరు, కుర్మల్గూడ, బహదూర్పల్లి ప్రాంతాల్లో అభివృద్ధి చేసిన హెచ్ఎండీఏ లేఅవుట్లలో మౌలిక వసతుల కల్పన కోసం మొత్తం రూ.53 కోట్లను వెచ్చించాలని కార్యాచరణ రూపొందించారు. ఇప్పటికే నగరంలోని ఉప్పల్ భగాయత్లో సుమారు 400 ఎకరాల్లో చేపట్టిన లేఅవుట్ తరహాలోనే విశాలమైన రోడ్లు, మంచినీరు, సీవరేజ్ లైన్లు, విద్యుత్, పార్కులు వంటి మౌలిక వసతులను మూడు లేఅవుట్లలో కల్పించచనున్నారు. లేఅవుట్ నిబంధనల ప్రకారం 10 శాతం భూమిని కమ్యూనిటీ అవసరాల కోసం కేటాయిస్తున్నారు. ప్లాట్ల విక్రయాన్ని అత్యంత పారదర్శకంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టీసీతో కలిసి ఆన్లైన్ వేలం ప్రక్రియలో చేపట్టారు.
ప్రభుత్వ భూమిలో చేసిన లేఅవుట్ అయినా, ప్రైవేటు భూముల్లో చేసినా లేఅవుట్ అయినా హెచ్ఎండీఏ నిబంధనలకు అనుగుణంగా అభివృద్ధి చేసిన లేఅవుట్లకు మంచి డిమాండ్ ఉంది. ప్రైవేట్ రియల్ ఎస్టేట్ కంపెనీల కంటే మెరుగ్గా లేఅవుట్లను అభివృద్ధి చేయడంతో హెచ్ఎండీఏకు ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. దీంతో కొనుగోలు దారులు హెచ్ఎండీఏ లేఅవుట్లకే అధిక ప్రాధాన్యనిస్తున్నారు.