కాప్రా, డిసెంబర్ 7: ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన రాష్ట్రప్రభుత్వాలపై దాష్టీకాన్ని కనబరుస్తున్న గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ‘చలో రాజ్భవన్’ ముట్టడి కార్యక్రమంలో అఖిల భారత యువజన సమాఖ్య యువజన సంఘం (ఏఐవైఎఫ్)మేడ్చల్ జిల్లా నాయకత్వం పాల్గొన్నది. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు సత్యప్రసాద్ మాట్లాడుతూ.. దేశంలో గవర్నర్ల వ్యవస్థ ప్రజల హక్కులను కాలరాసే విధంగా మారిందని, దీనికి నిదర్శనమే ప్రజల చేత ఎన్నుకోబడిన రాష్ట్రప్రభుత్వాలపై నిరంకుశ గవర్నర్గిరి ద్వార కేంద్ర ప్రభుత్వం ఎనిమిదేండ్లుగా అప్రజాస్వామ్యయుతంగా వ్యవహరిస్తున్నదని అన్నారు.
కేంద్రపాలకులకు కీలు బొమ్మలుగా మారిన గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని, ఆ వ్యవస్థను న్యాయపరిధిలోకి తేవాలని ఆయన డిమాండ్ చేశా రు. రాజ్భవన్ ముట్టడికి తరలిన నేతలను ఖైరతాబాద్ చౌరస్తావద్ద పోలీసులు అరెస్ట్ చేసి గాంధీనగర్ పీఎస్కు తరలించారు. ఆ తర్వాత సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నేతలు సల్మాన్ బేగ్, రాజ్కుమార్, రాకేశ్, విజయ్, నాయకులు పాల్గొన్నారు.
రాజ్భవన్ ముట్టడి.. ముందస్తు అరెస్టులు
చర్లపల్లి, డిసెంబర్ 7 : సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ ఆధ్వర్యంలో చేపట్టిన రాజ్భవన్ ముట్టడి సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వీఎస్.బోస్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీపీఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాజ్భవన్ ముట్టడి కార్యక్రమం నేపథ్యంలో ముందస్తు అరెస్టులు చేపట్టారు. ఈ సందర్భంగా నాయకు లు ధర్మేంద్ర మాట్లాడుతూ.. పోలీసులు కమ్యూనిస్ట్ నేతలపై ఏకపక్ష ధో రణితో వ్యవహరిస్తున్నారని, గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలన్నారు.