హైదరాబాద్ : సీపీఐ(CPI ) తెలంగాణ(Hyderabad) రాష్ట్ర కార్యాలయంలో జాతీయ సమితి సమావేశాలు (National committee meetings) శుక్రవారం ప్రారంభమయ్యాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 150 మంది ప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరయ్యారు. లోక్సభ ఎన్నికలు, పార్టీ సభ్యత్వం, పార్టీ సంస్థాగత బలోపేతంపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో సీపీఐ పార్టీ జాతీయ కార్యదర్శి డి.రాజా, రాష్ట్రానికి చెందిన సీపీఐ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.