హైదరాబాద్, ఏప్రిల్ 8: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ పర్యటనను నిరసిస్తూ నగర వ్యాప్తంగా వివిధ పార్టీలు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. పలు చోట్ల ప్రధాని దిష్టి బొమ్మలను దహనం చేశారు. తెలంగాణ ద్రోహి మోదీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.శనివారం హిమాయత్నగర్ వై జంక్షన్ వద్ద సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రధాని మోదీ తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెట్టడం సిగ్గు చేటన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈ.టీ నరసింహ, విఎస్బోస్, నగర కార్యదర్శి ఎస్. ఛాయదేవి, నాయకులు పి.ప్రేంపావని, బి.వెంకటేశం, చంద్రమోహన్గౌడ్, పడాల నళిని, ఎన్.శ్రీకాంత్, ఆర్.మల్లేశ్,ఆరుట్ల రాజుకుమార్, లతీఫ్, ఒమర్ఖాన్ పాల్గొన్నారు.
ప్రధానికి పర్యటించే హక్కులేదు: కూనంనేని
తెలంగాణ రాష్ట్ర విజభన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రధాన మంత్రి తెలంగాణలో పర్యటించే హక్కలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. శనివారం శంషాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రధానమంత్రి పర్యటనకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జంగయ్య, పర్యతాలు, పుస్తకాల నర్సింగ్రావు, సయ్యద్ అఫ్సర్, నర్ర గిరి పాల్గొన్నారు.
ఓయూలో మోదీ దిష్టిబొమ్మ దహనం
ప్రధాని మోదీ పర్యటనను నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ ఎన్సీసీ గేటు వద్ద మోదీ దిష్టిబొమ్మను బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు ఆధ్వర్యంలో దహనం చేశారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ అభివృద్ధి చేయడం చేతకాని మోదీకి ఆర్భాటాలు ఎందుకని ప్రశ్నించారు. ఏ ముఖం పెట్టుకుని తెలంగాణలో పర్యటిస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు కోతి విజయ్, పెద్దమ్మ రమేశ్, శిగ వెంకటేశ్, కృష్ణ, మేకల రవి, నాగరాజుయాదవ్, కాటం శివకుమార్, నాగారం ప్రశాంత్, రమేశ్గౌడ్, శ్రీనునాయక్, రేణు, రామకృష్ణ, మిద్దె సురేశ్, సంపత్ పాల్గొన్నారు.
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో..
తెలంగాణ పట్ల కేంద్రప్రభుత్వం వైఖరికి వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఓయూలో ప్రధాని నరేంద్రమోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ఓయూ కార్యదర్శి రవినాయక్ ఎస్ఎఫ్ఐ నాయకులు ఆంజనేయులు, శ్రీను, సాయికిరణ్, పవన్కళ్యాణ్, రాజు, కృష్ణ, సందీప్, అనిల్, విజయ్, దిలీప్, శ్రీకాంత్, మంజునాథ్ పాల్గొన్నారు.
షాపూర్నగర్లో వామపక్షాల నిరసన..
ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనను వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు శనివారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్నగర్లో దిష్టిబొమ్మలు దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు.
కేపీహెచ్బీ కాలనీలో..
ప్రధాని మోదీ దేశాన్ని గంపగుత్తగా అమ్మేస్తున్నాడని కూకట్పల్లి సీపీఐ సీనియర్ నేతలు బి.ఎన్.సుదర్శన్, ఐ.రాజశేఖర్, ఎం.శంకర్ అన్నారు. శనివారం కూకట్పల్లి అంబేద్కర్ వై జంక్షన్లో మోదీ గో బ్యాక్ అంటూ సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
రామంతాపూర్లో..
ప్రధాని మోదీ రాకను నిరసిస్తూ రామంతాపూర్ డీమార్టు వద్ద సీపీఎం ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. ఈకార్యక్రమంలో నాయకులు వై. వెంకటేశ్వర్లు, బాలయ్య, యాదగిరి,చలపతిరావు, తుకారం,కిరణ్,అశోక్ తదితరులు