సుల్తాన్బజార్,మే 30 : కరోనా విపత్కర సమయంలో నిరంతరం వైద్యసేవలు అందిస్తున్న వైద్యు లు, వైద్య సిబ్బందిపై అక్కడక్కడ దాడులు జరగడం హేయమైన చర్య అని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అన్నారు. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర వైద్య ఆరోగ్య సంఘాల ఐక్య వేదిక ప్రతినిధులు డాక్టర్ రవి శంకర్ ప్రజాపతి, డాక్టర్ కత్తి జనార్దన్, డాక్టర్ అభి రాం, దేవికలు ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కరోనా విపత్కర సమయంలో వైద్యులు అందజేస్తున్న సేవలను కొనియాడుతూ సీపీ.. ఐక్య వేదిక ప్రతినిధులకు పూల కుండీలు అం దించి సన్మానించారు. అనంతరం సీపీ మాట్లాడు తూ.. కరోనా క్లిష్ట సమయంలో వైద్యులు, వైద్య సి బ్బందిపై అక్కడక్కడ దాడులు జరగడం సరైంది కాదన్నారు. వైద్యులను, వైద్య సిబ్బందిని కాపాడుకోవాల్సిన అవసరం సమాజంపై ఉందన్నారు. వైద్య ఆరో గ్య శాఖలోని ఆశ వర్కర్ల నుంచి డైరెక్టర్ల వరకు వివి ధ హోదాల్లో విధులు నిర్వహిస్తున్న ఎంతో మంది కొవిడ్ బారినపడి మృత్యువాత పడుతున్నా మొక్కవోని ధైర్యంతో ప్రాణాలకు తెగించి.. వైద్యం చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో వైద్య ఆరో గ్య సంఘాల ఐక్య వేదిక ప్రతినిధులు మంచాల రవీందర్, భూపాల్, శ్రీనివాస్, శివకుమార్ పాల్గొన్నారు.