మేడ్చల్కలెక్టరేట్, ఆగస్టు 31: పశువుల యజమానుల నిర్లక్ష్యంతో రోడ్లపై ప్రమాదాలు జరగుతున్నాయి. అయి నా పశువుల యాజమానులకు పట్టింపు లేకుండా పో యింది. ఆవుల యజమానులు ప్రతి రోజూ పాలను పితికిన అనంతరం వాటిని రోడ్లపైకి వదులుతున్నారు. దీంతో అవి రోడ్లపైపోట్లాడడం,పడుకోవడంతోవాహనదారులు, ప్రజలు ప్రదాదాల బారిన పడతున్నారు.
ప్రధాన రోడ్లపై ఆవులు పడుకోవడంతో వేగంగా వచ్చే వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. కొన్ని సంవత్సరాలుగా ఆవులు దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని బండ్లగూడ ప్రధాన రహదారిలో రాత్రి పగలు అనే తేడా లేకుండా రోడ్లపై వాహనాలకు అడంగా తిరుగుతున్నాయి. గత నెల రోడ్లపై ఉన్న ఆవులను వ్యాన్ ఢీకొట్టంతో ఒక ఆవు మృతి చెందడంతో పాటు వ్యాన్ డ్రైవర్కు గాయాలయ్యాయి. ఆవుల యజమానులు వాటిని ఇష్టానుసారంగా వదిలివేయడంలో అవి కాస్తా అక్కడక్కడ గడ్డి తిని రోడ్ల మధ్య లో పడుకుంటున్నాయి. ఆవులు రోడ్డపై సంచరించకుం డా అధికారులు చర్యలు తీసుకొని ప్రమాదాలు జరుగకుండా చూడాలని, ఆవులు యజమానికి సమాచారం అందించి వారు స్పందించకుంటే వారిపై చర్యలు తీసుకోవాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు.
యజమానులను గుర్తించి చర్యలు తీసుకుంటాం
ఆవుల యజమానులను గుర్తిం చి వారిపై చర్యలు తీసుకుంటాం. బండ్లగూడ ప్రధాన రహదారిపై ఆవులు తిరగకుండా చూస్తాం. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఆవుల యజమానులతో మాట్లాడి అవి రోడ్లపై ఉండకుండా చర్యలు తీసుకుంటాం.
– రాజమల్లయ్య, కమిషనర్, దమ్మాయిగూడ