కొండాపూర్, ఏప్రిల్ 26 : కరోనా రెండోదశ విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వం వైరస్ నియంత్రణకు తీసుకొచ్చిన వ్యాక్సిన్ను క్రమంగా అన్ని వయస్సుల వారికి వర్తింపజేస్తున్నది. మే 1 నుంచి అన్ని వయస్సుల వారికి వ్యాక్సిన్ అందించేందుకు ఏర్పా ట్లు చురుగ్గా సాగుతున్నాయి. వ్యాక్సిన్ వేసుకుంటే అనారోగ్యానికి గురవుతామని, దీర్ఘకాలిక వ్యాధిగస్ర్తులకు సమస్యలు వస్తాయని రకరకాలు అనుమానాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ప్రధానంగా క్యాన్సర్ రోగుల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. అసలు క్యాన్సర్ రోగులు వ్యాక్సిన్ వేసుకోవచ్చా ? వేసుకున్న తర్వాత ఏమైనా దుష్ఫలితాలు వస్తాయా? తదితర వాటిని వివరించారు చీఫ్ ఆఫ్ రేడియేషన్ ఆంకాలజీ, మెడికవర్ వైద్యుడు డాక్టర్ వినోద్ మద్దిరెడ్డి.
చాలాచాలా తక్కువ సందర్భాల్లోనే కాళ్లు, కడు పు, మెదడులో బ్లడ్ క్లాట్స్ కేసులు కనిపిస్తున్నాయి. రక్తం గడ్డ కట్టడం అనేది అపోహ మాత్రమే. అందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలి.
ఇవి కూడా చదవండి..
pulse oximeter : పల్స్ ఆక్సీమీటర్ ఎలా పనిచేస్తుంది? దాన్ని ఎలా ఉపయోగించాలి?
వణికిస్తున్న ట్రిపుల్ మ్యుటెంట్.. ఎందుకంత డేంజర్? ఏం చేయాలి?
ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసేవాళ్లు కోవిడ్ టీకా తీసుకోవచ్చా ?
వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉండే వాళ్లు తినాల్సిన ఆహారపదార్థాలు