సెకండ్ వేవ్ భారత్ ని అల్లాడిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతుండటంతో ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలన్నీ దరిదాపు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ని ఇచ్చేశాయి. దీంతో పనివేళలు కూడా ఎక్కువైపోయాయి. ఇలాంటి టైమ్ లో ఎలాంటి ఆహారం తీసుకోవాలి. ఏది తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎక్కువ సేపు కూర్చొని ఉండటం, మానిసిక ఒత్తిడి పెరగడం తదితర కారణాలతో అనేక అనారోగ్యసమస్యలు వస్తున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్లు వీలైనంతగా లైట్ ఫుడ్ తీసుకోవడం మంచిందంటున్నారు. ప్రోటీన్లు, విటమిన్ ఫుడ్ ఉండేలా చూసుకోమని డైటీషియన్లు చెబుతున్నారు. అందులో చెప్పుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి.
డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం చాలామంచిది. కోవిడ్ టైమ్ లో ఇలాంటి ఆరోగ్యకరమైన ఆహారం చాలా అవసరం. ఆకలి తీర్చడమే కాదు బాడీలోని చెడు కొవ్వును తగ్గిస్తాయి.
బఠాణీల్లో ప్రోటీన్, ఫైబర్, విటమిన్స్, మినరల్స్ చాలా ఉంటాయి. అలాగే మన శరీరానికి అవసరమైన అమైనో యాసిడ్స్ బఠాణీల్లో ఉంటాయి. కేలరీలు తక్కువ. అందువల్ల… వేపిన బఠాణీలు రోజుకో అరకప్పు తింటే మంచిదే.
తక్కువ ఫ్యాట్ ఉండే మిల్క్, ఎక్కువ కోకో ఉన్న డార్క్ చాకొలెట్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఎక్కువ పని ఒత్తిడిలో ఉండి అలసిపోయినప్పుడు ఓ డార్క్ చాకొలెట్ తింటే చాలు… వెంటనే మూడ్ మారుతుంది. ఈ చాకొలెట్లు అప్పడప్పుడు తినడం మంచిది. ఎక్కువగా తింటే బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది.
అలాగే ఓట్స్ కూడా చాలామంచిది. ఎనర్జీ పెరగాలంటే… మల్టీగ్రెయిన్ ఓట్స్ తీసుకోవాలి. వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి.