బంజారాహిల్స్, జూన్ 16: ఇంటి ముందు నీళ్లు పట్టుకునేందుకు వచ్చిన యువతిని గదిలోకి లాక్కెళ్లి అత్యాచారం చేసిన వ్యక్తికి పదేండ్ల జైలుశిక్ష పడింది. వరంగల్ జిల్లాకు చెందిన తక్కళ్లపల్లి రవీందర్రావు అలియాస్ రవీందర్(45) ఫిలింనగర్లోని ఎంఆర్సీ కాలనీలో నివాసముంటూ సినిమాల్లో లైట్మెన్గా పనిచేసేవాడు. 2010 నవంబర్ 17న యువతి (18)పై లైంగికదాడికి పాల్పడ్డాడు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పక్కా అధారాలను కోర్టుకు సమర్పించారు. విచారించిన 11వ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు.. నిందితుడు రవీందర్రావుకు పదేండ్ల జైలుశిక్షతో పాటు 10వేల జరిమానా విధిస్తూ గురువారం తీర్పును వెలువరించింది.