నేరేడ్మెట్, ఏప్రిల్ 19 : బాలికను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి మల్కాజిగిరి ఎంఎస్జే కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పి వెల్లడిచింది. డీసీపీ జానకి దరావత్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ర్టానికి చెందిన అభిరాందాస్ (34) అలియాస్ అభయదాస్ స్థానికంగా కూలీ పనులు చేస్తూ జీవనంసాగించేవాడు. మే, 2021లో బండ్లగూడ ప్రాంతంలో ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికను చాక్లెట్లు, బిస్కెట్లు ఇప్పిస్తానని నమ్మించి కిడ్నాప్ చేశాడు. నాగారం పరిధి కట్టమైసమ్మ దేవాలయం సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. అదే రోజు అర్ధరాత్రి బండ్లగూడలోని కిరాణ దుకాణం సమీపంలోని పొదల్లో పడేసి పరారయ్యాడు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కీసర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బుధవారం కేసు విచారణ పూర్తికావడంతో మల్కాజిగిరి ఎంఎస్జే కోర్టు న్యాయమూర్తి రఘునాథరెడ్డి నిందితుడు అభిరాందాస్కు జీవిత ఖైదుతోపాటు రూ.5వేలు జరిమానా విధించింది.
మెహిదీపట్నం, ఏప్రిల్ 19 : బాలికను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి 20ఏళ్లు జైలు శిక్ష, రూ.2500 జరిమానా విధిస్తూ బుధవారం 12వ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి టి.అనిత తీర్పు వెల్లడించారు. పశ్చిమ మండలం డీసీపీ కిరణ్ ఖరె తెలిపిన వివరాల ప్రకారం… లంగర్హౌస్ బాపూనగర్ శివాలయం సమీపంలో నివాసముండే టి.చాన్ కరన్సింగ్ అలియాస్ అకాశ్(24) ఆటో డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. డిసెంబర్, 2021లో ఓ బాలికకు మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు లంగర్హౌస్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయస్థానం నిందితుడికి 20ఏళ్లు జైలు శిక్ష, రూ.2500 జరిమానా విధిస్తూ తీర్పును వెల్లడించారు.